జనవరి 02 న కొండగట్టులో వారాహి కి పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచార బస్సు సిద్ధమైంది. ఈ ప్రచార బస్సుకు వారాహి అనే పేరు పెట్టడం జరిగింది. రీసెంట్ గా వారాహి తో పాటు మరికొన్ని వాహనాలకు రిజిస్టేషన్ పనులను పూర్తి చేయడం జరిగింది. ఇక జనవరి 02 న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు లో వారాహి కి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు.

ఏకాదశిని పురస్కరించుకొని.. జనసేన నేతలు వాహన పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ చేసిన తర్వాత.. ఏపీలోని విజయవాడ కనకదుర్గ ఆలయంలోనూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక వారాహి కలర్ విషయంలో పెద్ద రగడే జరిగిన సంగతి తెలిసిందే. ఆర్మీ కలర్ పోలి ఉందని , దీనికి రిజిస్టేషన్ చేయరని వైస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తునే కామెంట్స్ చేసారు. కానీ రవాణాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి అడ్డు చెప్పకుండా రిజిస్టేషన్ పూర్తి చేసారు.