ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లు దాటిన కరోనా బాధితులు
మొత్తం మరణాలు 9,45,066
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,00,31,976 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనాతో 9,45,066 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 72,87,262 మంది చికిత్స పొందుతుండగా, 2,17,99,648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికాలో కొత్తగా 36 వేల కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసులు 68,28,301కి చేరాయి. నిన్న 1023 మంది మరణించారు. దీంతో మొత్తం మృతులు 2,01,348కి చేరారు. భారత్లో 51,15,893, బ్రెజిల్లో 44,21,686, రష్యాలో 1,79,519 కరోనా బాధితులు ఉన్నారు. పెరూలో 7.38 లక్షలు, కొలంబియాలో 7.3 లక్షలు, మెక్సికోలో 6.76 లక్షల మంది, దక్షిణాఫ్రికాలో 6.53 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. మరణాల రేటులో ప్రపంచంలో మెక్సికో నాలుగో స్థానంలో ఉన్నది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/