ఆలయ ఘటనలను జగన్ ఎందుకు ఖండించడం లేదు?
![devineni uma maheswara rao](https://www.vaartha.com/wp-content/uploads/2020/04/devineni-uma-maheswara-rao.jpg)
అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలోని వెండి ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు అపహరణకు గురైన విషయం మాట్లాడుతూ.. తాము అడుగుతోన్న ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో ఎప్పుడూలేని వింతపోకడలు, భక్తులు జైల్లో ఉంటే అరాచకశక్తులు రోడ్లపైనా? చవితి వేడుకలకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం, పుట్టినరోజు వేడుకలకు మాత్రం ప్రోత్సాహకాలతో జీవోలతో హడావుడా? ఆలయ ఘటనలను ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడం లేదని అడుగుతున్న చంద్రబాబు నాయుడి మాటలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు. కాగా, ఏపిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దేవాలయాల్లో ఘటనలు జరుగుతుంటే జగన్ నోరు తెరిచి ఎందుకు ఖండించట్లేదని నిన్న చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి ఏపిలో అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దాదాపు 80 ఘటనలు జరిగాయని ఆయన చెప్పారు. వీటిపై సిఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటే ఇన్ని జరిగేవి కావని ఆయన అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/