సారా తయారీదారులపై పీడీయాక్టు నమోదు చేస్తాం

ఈ ఏడాదిలో మరో 25 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తాం

k narayana swamy
k narayana swamy

అమరావతి: ఈ ఏడాది మరో 25 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మద్యనిషేధంపై టిడిపి బురద రాజకీయం చేస్తుందని, సారా తయారీదారులపై పీడీ యాక్టు పెడతామని నారాయణస్వామి స్పష్టం చేశారు. చంద్రబాబు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మద్యం డిస్టీలరీలకు రూ. 1783 కోట్ల బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని, మద్యం డిస్టిలరీల బకాయిలు చెల్లించేందుకు ప్రపంచబ్యాంకు రుణం కోరతామని నారాయణస్వామి తెలిపారు. మద్యం బాటిళ్లతో బోండా ఉమ ప్రెస్‌మీట్‌ పెట్టడమేంటి? అని నారాయణస్వామి ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/