వాల్తేర్ వీరయ్య సెన్సార్ పూర్తి

వాల్తేర్ వీరయ్య సెన్సార్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ప్రస్తుతం చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఒక్కోటి ఒక్కో రేంజ్ లో ఉండగా..అసలు సిసలైన ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. సినిమా చూసిన మేకర్స్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు .