విశాఖ లో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు..

విశాఖపట్నం జిల్లాలోని కాశీపట్నం దగ్గర విశాఖ –కిరండల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెనువెంటనే లోకోపైలెట్ అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఫలితంగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రైలు పట్టాలు తప్పడంతో ఒక భోగి పక్కకు ఒరిగిందని, అయితే రైలు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అవ్వడం తో పెను పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, కుటుంబసభ్యులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల రాకపోకలకు పునరుద్దరణ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కొండ ప్రాంతాల్లో అతి శీతల ఉష్ణోగ్రతలున్న సమయాల్లో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు.