తన పెద్ద మనసు చాటుకున్న డైరెక్టర్ సుకుమార్

పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం తనవంతు సాయం అందించి వార్తల్లో నిలిచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జనుపల్లెకు చెందిన ఆనంద్ కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతని స్నేహితులు ఆనంద్‌ చికిత్స కోసం డబ్బులు ఎవరైనా సాయం చేయగలరంటూ ఫేస్‌బుక్‌ లో ఒక పోస్ట్‌ పెట్టారు.

దీనిని చూసిన డైరెక్టర్‌ సుకుమార్‌ అతనికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇలా సాయం చేయడం సుకుమార్ ఇదే మొదటిసారి కాదు గతంలోనూ పలు సేవ కార్యక్రమాలు చేసారు. తన స్వస్థలం మట్టపర్రు గ్రామంలో తన సొంత నిధులతో పాఠశాలను ఏర్పాటు చేసారు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ తన తండ్రి పేరుతో పలు స్కూల్స్‌, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక కరోనా కాలంలోనూ రూ.లక్షలు ఖర్చు చేసి బాధితులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆహార సదుపాయాలు సమకూర్చారు. ఇక ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి సాయం చేసి వార్తల్లో నిలిచారు .

ఇక సినిమాల విషయానికి వస్తే..అల్లు అర్జున్ తో పుష్ప మూవీ చేసి పాన్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్..ప్రస్తుతం పుష్ప 2 తో బిజీ గా ఉన్నారు.