ఏపీని గంజాయి రాజధాని అని లోకేశ్ అన్నారుః విజయసాయిరెడ్డి
రాష్ట్ర ప్రజలను కించపరిచాడని వ్యాఖ్య
అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ పై వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ గంజాయి రాజధాని అని, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని లోకేశ్ చెప్పాడని వివర్శించారు. ఏపీని, రాష్ట్ర ప్రజలను లోకేశ్ కించపరిచారని మండిపడ్డారు. మీరు ఏపీకి పురస్కారాలు తీసుకురాకపోయినా పర్వాలేదు, కనీసం మమ్మల్ని కించపరచకుండా ఉండండి అని చెప్పారు. సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.