పెనమలూరులో టిడిపి నుండి తెరపైకి కొత్త పేరు..?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ వరుసపెట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుండగా..టిడిపి సైతం జనసేన తో పొత్తు పెట్టుకోవడం తో ఇరు అధినేతలు చర్చలు జరుపుతూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో NTR(D) పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకొచ్చింది.

దివంగత సినీ హీరో కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు పేరును టీడీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శేషగిరిరావు పోటీ చేస్తే కృష్ణ, ఆయన కుమారుడు మహేశ్ బాబు అభిమానుల మద్దతు లభించే అవకాశం ఉందని టీడీపీ లెక్కలేస్తోందట. గతంలో శేషగిరి రావు కాంగ్రెస్, వైసీపీలో పని చేశారు. అప్పట్లో GNT, కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆ దిశగా అడుగు పడలేదు. కానీ ఇప్పుడు ఈయన టిడిపి నుండి పోటీ చేయబోతారని వినికిడి.