మరోసారి గీత గోవిందం కాంబో రిపీట్..

గీత గోవిందం ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ – రష్మిక కలయికలో పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తో విజయ్ – రష్మిక ల క్రేజ్ అమాంతం పెరిగింది. యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ రాబోతుంది. డైరెక్టర్ పరుశురాం – విజయ్ కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతుంది.

వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది గీత గోవిందమ్ కు సీక్వెల్ కాదని, తాజా స్క్రిప్ట్ తోనే ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు. పెద్ద బడ్జెట్ తోనే ఈ సినిమాని తీయనున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక ను తీసుకుంటారా..లేక మరొకర్ని తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి మూవీ చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.