దేవినేనిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి గెలిచినందుకే ఇంత బలుపా? అని తనను అంటున్నారని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమపై 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినందుకు తన బలుపేనని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..ఉమ వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు టీడీపీని వీడి వైస్సార్సీపీ లో చేరారని విమర్శించారు.

ఉమా ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీకి 500 ఓట్లు తగ్గుతాయని ఎద్దేవా చేశారు. నందిగామలో కనుక ఉమ ప్రచారం చేస్తే అక్కడ రెండోసారి కూడా జగన్మోహన్‌రావే గెలుస్తారని జోస్యం చెప్పారు. దేవినేని గతంలో గ్రావెల్, ఇసుకను అక్రమంగా దోచుకుని ఎదిగారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆయన వైస్సార్సీపీ కి అనుకూల శత్రువని అన్నారు.