నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విశాఖ లో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ నుండి విమానంలో విశాఖ బయల్దేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకుని అక్కడ్నించి రోడ్డు మార్గంలో అచ్యుతాపురం వెళ్లనున్నారు. ప్రగడ నాగేశ్వరరావు (యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి) నివాసానికి చేరుకుని, కొత్త దంపతులు రాజు-భానులకు ఆశీస్సులు అందజేయనున్నారు.

సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు విశాఖ పోర్టు స్టేడియానికి చేరుకోనున్నారు. అక్కడ విశాఖ (వెస్ట్) ఎమ్మెల్యే గణబాబు కుమారుడి పెళ్లికి హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వుడా పార్కులో బి.వెంకటరమణ యాదవ్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారు. ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం విజయవాడ బయలుదేరనున్నారు.