నిశ్చితార్థం పూర్తి కాగానే ఫారిన్ చెక్కేసిన వరుణ్ – లావణ్య

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థ వేడుక మెగా కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ..ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులు , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ మొదలగు వారు హాజరయ్యారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ కూల్ పిక్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన మనసు దోచుకున్న లావణ్య త్రిపాఠీతో కలిసి ఫారెన్ లో చక్కర్లు కొడుతున్నట్లు తెలిపారు. అలాగే తమకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు.

వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో ‘మిస్టర్’ సెట్స్ లో కలుసుకున్నారు. షూటింగ్ సమయం లో ఇరువురి మధ్య స్నేహం పెరిగింది..ఆ స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ జంట రెండవ చిత్రం అంతరిక్షం 9000 KMPH చిత్రీకరణ సమయం లో డేటింగ్ చేస్తున్నారనే వార్త వెలుగు లోకి వచ్చింది. చివరికి వరుణ్ తేజ్-లావణ్య కలిసి బహిరంగంగా కనిపించడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు వివాహం బంధం తో త్వరలో ఒకటి కాబోతున్నారు.