బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

మరోసారి అధికార పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులు కలవరపెడుతున్నాయి. గతంలో వరుసగా నేతల ఇళ్లలో , ఆఫీసులలో దాడులు జరుగగా..ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు దాడులు మొదలుపెట్టారు. బుధువారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఉదయం నుండి తనిఖీలు చేస్తున్నారు. అలాగే శేఖర్ రెడ్డి సిబ్బంది ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు.

దాదాపు 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఏకకాలంలో ఎమ్మెల్యే నివాసాలు, కార్యాలయాలతో పాటు సిబ్బంది ఇంట్లో ఈ తనిఖీలు చేపడుతున్నాయి. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు వ్యాపారులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఐదు, ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటం, ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఒక్కసారిగా ఐటీ రైడ్స్ కలకలం సృషిస్తున్నాయి.