త్వరలోనే వైస్సార్సీపీ కి ప్రజలు వీడ్కోలు పలుకుతారు : వర్ల రామయ్య

అమరావతి : టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏపీ మంత్రి మేరుగ నాగార్జునపై మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని… ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత, సంస్కారంతో మాట్లాడాలని హితవు పలికారు. త్వరలోనే సీఎం జగన్ కు, వైస్సార్సీపీ కి రాష్ట్ర ప్రజలు వీడ్కోలు పలుకుతారని అన్నారు.

వైస్సార్సీపీ చెపుతున్న సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి వంటిదని ఎద్దేవా చేశారు. మీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి ఏమాత్రం స్పందన లేదని… మీరు చెపుతున్నట్టు సామాజిక న్యాయం ఉంటే జనాలు ఎందుకు రారని అన్నారు. వైస్సార్సీపీ పాలనలో సామాజిక న్యాయం లేదు కనుకే… ప్రజలు రావడం లేదని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/