విలన్లు ఎంతమంది ఉన్న జగన్ మాత్రం హీరోనే – వల్లభనేని వంశీ

సినిమాల్లో విలన్లు ఎంతో మంది ఉంటారని, హీరో మాత్రం ఒక్కడే ఉంటాడని… సీఎం జగన్ కూడా అంతేనని అన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న బిజెపి సైతం అధికార పార్టీ వైస్సార్సీపీ ఫై మాటల యుద్ధం స్టార్ట్ చేసింది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్ ఫై ప్రశంసలు కురిపిస్తూ..టీడీపీ ఫై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని, అలాంటి వాళ్లు జగన్ ను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిని సమాధులతో చంద్రబాబు పోల్చడంపై మండిపడ్డారు. చంద్రబాబు కూడా కాటికి కాలు చాపారని… అలాంటి వ్యక్తికి శ్మశానమే గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. జగన్ ను విమర్శించేవాళ్లంతా పనికిమాలిన సన్నాసులని అన్నారు. తన నియోజకవర్గంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని… వాటిలో చాలా మంది ఇళ్లు కట్టుకుని, గృహప్రవేశాలు కూడా చేశారని చెప్పారు. సినిమాల్లో విలన్లు ఎంతో మంది ఉంటారని, హీరో మాత్రం ఒక్కడే ఉంటాడని… ముఖ్యమంత్రి జగన్ కూడా అంతేనని చెప్పారు. జగన్ ఒంటరిగానే యుద్ధం చేస్తారని పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు వంశీ.

.