ఉస్మానియా ఆస్ప‌త్రిలో ఇద్ద‌రు మృతి.. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌

two-person-died-in-osmania-and-tested-corona-positive

హైదరాబాద్‌ః తెలంగాణలో కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా… ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోపక్క, తెలంగాణలో తాజాగా కొవిడ్ మృతి కేసులు నమోదయ్యాయి. అనారోగ్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. సమస్య తీవ్రతరం కావడంతో ఇద్దరూ మృతి చెందారు. మృతి చెందినవారిలో ఒకరికి అరవై ఏళ్లు, మరొకరికి నలభై ఏళ్లు ఉన్నాయి. మృతులకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇక్కడే ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కూడా పాజిటివ్ అని తేలింది.