ఒక్క రోజులోనే లక్షన్నర కేసులు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
New Delhi: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. . గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,52,879 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. . వైరస్ ధాటికి 839 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805కు చేరింది. మృతుల సంఖ్య 1,69,275కి చేరింది. దేశ వ్యాప్తంగా 10,15,95,147 మందికి వ్యాక్సిన్లు అందించారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/