‘బీఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా త్వరలో రెండు గ్యారంటీలు’ – భట్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినా కాంగ్రెస్ పార్టీ..ప్రస్తతం ప్రజలు కోరుకునే పాలన అందిస్తూ ముందుకు సాగుతుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పెంపు వంటివి అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంచింది. 100 రోజులు పూర్తి అయ్యేలోపు అన్ని హామీ పథకాలు అమలు చేస్తామని చెపుతున్నారు.

బీఆర్ఎస్ నేతలకు దిమ్మ తిరిగేలా త్వరలోనే మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర, చింతకాని మండలాల్లో శనివారం పర్యటించి మాట్లాడారు. టీఎస్పీఎస్సీకి కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించిన నేపథ్యాన ఎన్నికలకు ముందు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాల నియామకం పారదర్శకంగా చేపడతామని తెలిపారు.