టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు..

టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) 28 ఏళ్లు గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రమౌళికి ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది.

జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. చంద్రమౌళి ముంబై లో ఉద్యోగం చేస్తున్నారని, సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై అల్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. అయితే కొద్దిసేపటికే గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో పక్కనే ఉన్న స్నేహితుడు వెంటనే సమీపంలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.

చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు పెళ్లిపత్రికలు ఇవ్వడానికి నిన్న మధ్యాహ్నం ఆయన కారులో వెళ్లారు. కాసేపటి తర్వాత గుండెలో నొప్పిగా ఉందని కారులోనే ఉన్న స్నేహితుడితో ఆయన చెప్పారు. దీంతో, ఆయనను నేరుగా కావేరి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే శేఖర్ రెడ్డి హాస్పిటల్ కు చేరున్నారు. ధర్మారెడ్డి దంపతులు నిన్న సాయంత్రం ఆసుపత్రికి వెళ్లారు. చంద్రమౌళి ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతోపాటు సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.