బండ్లగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం

బండ్లగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని షాదాన్ కాలేజ్ సమీపంలో వేగంగా వచ్చిన బస్సు రోడ్డుకు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలను ఢీ కొటుకుంటూ ముందుకువెళ్లింది. బస్సు ను చూసి వాహనదారులు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విలేకరులు ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డీ కొట్టడంతో రెండు కార్లు, రెండు బైకులు పాక్షికంగా ధ్వంసమైయ్యాయి.

ఆర్టీసీ చక్రాల కింద విలేకరుల బైకులు నలిగిపోయాయి. ఇక ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు.