మెడిసిన్ చదివే స్టూడెండ్స్‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. వాటిలో వైద్యం రంగం కూడా ఒకటి. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి వైద్య రంగాన్ని పటిష్టం చేస్తామని చెపుతూ వస్తున్న సీఎం కేసీఆర్..అందుకు తగ్గట్లే మెడికల్ కాలేజీలు ఏర్పటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాట్లు చేయగా.. తాజాగా మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినట్లైంది.

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల, వరంగల్, ములుగు, మెదక్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం సాకారం కానుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్ రావు.