భోళా శంకర్ నిర్మాతలపై కోర్ట్ లో పిర్యాదు చేసిన డిస్ట్రిబ్యూటర్

మరో రెండు రోజుల్లో భోళా శంకర్ మూవీ రిలీజ్ అవుతుండగా..ఆ చిత్ర నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ లపై కోర్ట్ లో పిర్యాదు చేసారు వైజాగ్ కు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్). ఏజెంట్ మూవీ విషయంలో నిర్మాతలు తనను మోసం చేసారని ఆయన కోర్ట్ లో పిర్యాదు చేసాడు.

ఏప్రిల్ నెలలో విడుదలైన ‘ఏజెంట్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు ఐదేళ్ల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి.. రూ. 30 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత కేవలం వైజాగ్ ఏరియా మాత్రమే ఇచ్చారు. అదేంటి అని అడిగితే డబ్బులు సెటిల్ చేస్తామని..వేరే సినిమాలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు చేసిన “సామజవరగమన” చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను వైజాగ్ వరకు ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం చాలా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామన్నారు. ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం చేశారు. అయితే వారి తదుపరి సినిమా “భోళా శంకర్” రిలీజ్ కు సిద్ధమైంది. అయితే కొద్ది రోజులుగా వారు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈరోజు బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుతాం. వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం” అని సత్యనారాయణ తెలిపారు. మరి కోర్ట్ తీర్పు ఏమిస్తుందో చూడాలి.

భోళా శంకర్ విషయానికి వస్తే..చిరంజీవి- తమన్నా జంటగా నటించగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేసారు. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ..ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ , టీజర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 11 వరకు ఆగాల్సిందే.