నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే ఉండడం తో అన్ని రాజకీయ పార్టీ లు తమ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేస్తున్నాయి. ఇప్పటీకే బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని మొదలుపెట్టగా..బీజేపీ సైతం ఈరోజు తమ అభ్యర్థుల తళుక్ మొదటి లిస్ట్ ను ప్రకటించబోతుంది.

కాంగ్రెస్ తరహాలోనే తొలి జాబితాను బిజెపి పార్టీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. 50 మందితో కూడిన ఈ జాబితాను ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అయితే కిషన్ రెడ్డి మరియు బిజెపి ఎంపీ లక్ష్మణ్ లు అసెంబ్లీ బరిలో ఉండడం లేదని తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ మాత్రం హుజరాబాద్ మరియు గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారట. అలాగే విజయశాంతికి కామారెడ్డి లేదా మెదక్ నియోజకవర్గం టికెట్ దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం లోపు బిజెపి ఫస్ట్ లిస్ట్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.