నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

సీఎం జగన్ ఈరోజు విజయవాడ లో పర్యటించనున్నారు. హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ సైతం పాల్గొనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు రాజ్ భవన్ కు చేరుకోనున్న సీఎం జగన్.. మొదటగా గవర్నర్ తో భేటి కానున్నారు. ఆ తర్వాత 11 గంటలకు గవర్నర్ తో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వేలంనున్నారు.

నిన్న జగన్..ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎంను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, హోంశాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.