మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది..

యూపీలోని మధుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. సడెన్ గా ఓ ట్రైన్ పట్టాలు దాటుకొని ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాద సమయంలో ప్లాట్‌ఫాంఫై ప్రయాణికులెవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మధుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ప్లాట్‌ఫాం పైకి ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

అంత ఎత్తున్న ప్లాట్‌ఫాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్లకు ఆటంకం ఏర్పడింది.