దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు..1,30,713

coronavirus covid-19
coronavirus covid-19

న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,629 మంది కోలుకోగా… 26 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713కి పెరిగింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,39,329కి పెరిగాయి. వీరిలో 4,29,83,162 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,454 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5.99 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,98,88,77,537 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 11,44,145 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/specials/career/