నారా భువనేశ్వరిని కలిసిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేయడం ఫై టీడీపీ శ్రేణులే కాదు మిగతా రాజకీయ పార్టీలు , సినీ , రాజకీయ ప్రముఖులు , వ్యాపారవేత్తలు స్పందిస్తూ..సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా తమ స్పందనను తెలియజేయగా..తాజాగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్..చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సంఘీభావాన్ని ప్రకటించేందుకే రాజమండ్రికి వచ్చానని తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం చంద్రబాబు తన జీవితాన్ని ధారబోశారని అన్నారు. కార్యదక్షత కలిగిన గొప్ప నేత చంద్రబాబు అని కితాబునిచ్చారు. అక్రమ కేసుల నుంచి బయటపడి, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు.