నేడు టిడిపిలో చేరనున్న దాడి వీరభద్రరావు
నిన్న వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
అమరావతిః సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నిన్న వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు కుమారులతో కలిసి ఆయన తన సొంత గూడు టిడిపిలోకి చేరనున్నారు. టిడిపి అధినేత చంద్రబాబుతో ఆయన అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈరోజు చంద్రబాబును ఆయన కలవనున్నారు. ఈ సందర్భంగా తన కుమారులు, అనుచరులతో కలిసి టిడిపి కండువా కప్పుకోనున్నారు. 2014 వరకు దాడి వీరభద్రరావు టిడిపిలో కీలక నేతగా ఉన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు దాడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు వైపు వచ్చారు. చంద్రబాబు పక్షాన చేరిన తర్వాత ఆయన పార్టీలో కీలక పాత్రను పోషించారు. ఈ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన టిడిపిని వీడారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు.