కనీ వినీ ఎరుగని పరిస్థితి ఇది
జాతినుద్ధేశించి ప్రధాని మోడీ ప్రసంగం

New Delhi: ప్రపంచం ఇంతకు ముందెన్నడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనలేదని ప్రధాని మోడీ అన్నారు.
జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన గత నాలుగు నెలలుగా కరోనాతో యుద్ధం చేస్తున్నామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 42లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారన్నారు.
ఒకే ఒక్క వైరస్ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తుందన్న ఆయన యావత్ ప్రపంచం ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతోందన్నారు.
ఓడిపోవడం మానవాళి అంగీకరించదన్నారు. ఇది కీలక సమయం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.
కరోనాకు ముందు వరకూ దేశంలో పీపీఈ కిట్ల తయారీ లేదనీ, కానీ అవసరం మనను ముందుకు నడిపించిందన్నారు.
ఇప్పుడు రోజుకు 2 లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్ల తయారీ మొదలైనట్లు ప్రధాని తెలిపారు.
ప్రాణాలు కాపాడుకుంటూనే, కరోనాతో పోరాడుతూనే ముందుకు సాగాల్సిన తరుణమిదని మోడీ చెప్పారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/