తల్లిని స్థంబానికి కట్టేసి చిత్ర హింసలు పెట్టిన కసాయి కొడుకు

నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మని ..ఏమాత్రం కనికరం లేకుండా ఓ కసాయి కొడుకు..తన పంటలో కాలీఫ్లవర్ కోసిందని చెప్పి స్థంబానికి తల్లిని కట్టేసి చిత్రహింసలు గురి చేసిన ఘటన ఒడిశాలోనీ కియోంఝర్లోని సరపసి గ్రామంలో చోటుచేసుకుంది. సదరు తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారికి వివాహాలు కాగా వ్యవసాయం చేసుకుంటూ వేర్వేరుగా జీవిస్తున్నారు.

కాగా చిన్న కొడుకు శత్రుఘ్న మహంత(39) కాలీఫ్లవర్ పంటను సాగు చేస్తున్నారు. అయితే కూర వండుకునేందుకు ఆ తల్లి కొడుకు వేసిన ఆ పంట నుంచి ఓ కాలిఫ్లవర్ ను తెంపుకొచ్చింది. ఇది చూసిన కొడుకు తన అనుమతి లేకుండా కాలీఫ్లవర్ ఎందుకు తెంపావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితో ఆగకుండా ఆ వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.