తిరుమలలో చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు. నిన్న రాత్రి చిరుత కెమెరాలకు చిక్కడంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు.

ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించడంతో అధికారులు ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారులు ప్రయాణీకుల భద్రతకు ఎటువంటి ముప్ప లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు నాలుగు చిరుతలను పట్టుకున్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో చిరుతలు తిరుమల కొండకు చేరుకుంటున్నాయని అటవీ శాఖ విభాగం తెలిపింది. తిరుమలలో ఇటీవల కాలంలో తరచూ చిరుతలు యాత్రికులను భయపెడుతున్నాయి.

గతంలో ఓ బాలుడిపై దాడి చేయడం, ఆతర్వాత మరో చిన్నారిని చంపేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్‌ చేపట్టారు. ఇప్పటికి నాలుగైదు చిరుతల్ని కూడా పట్టి వేశారు. దారిపొడవునా బోన్లను కూడా ఏర్పాటు చేశారు. మళ్లీ ఇప్పుడు నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది.