నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత..

ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గీయుల మధ్య తోపులాట , గొడవలు పడడం , రాళ్లు విసురుకోవడం వంటివి చేస్తున్నారు. ఇప్పటీకే పలు చోట్ల బిఆర్ఎస్ అభ్యర్థులకు గాయాలు కాగా..తాజాగా నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో BRS – కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. BRS నేతల వాహనాలపై కాంగ్రెస్ నేతలు రాళ్లు రువ్వడం తో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సకాలంలో పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ఇక నల్గొండ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిపై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ లో కేసీఆర్ ప్రచారానికి వెళ్లినప్పుడు.. నెల్లికల్ లిప్టు కట్టిస్తానని వాగ్దానం చేశారని.. కానీ అది ఇప్పటివరకు నెరవేర్చలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీంతో ధర్నాలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడి చేశారు.