ఈరోజు నుండి రెండో దశ వైస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం

వైస్సార్సీపీ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేటి నుండి రెండో దశ యాత్రను మొదలుపెట్టబోతుంది. ఇప్పటికే మొదటి దశ బస్సు యాత్ర విజయవంతం చేసిన మంత్రులు, వైసీపీ నేతలు.. రెండో దశ యాత్రను మరింత సక్సెస్ చేయాలనీ చూస్తున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రెండో ఫేజ్ బస్సు యాత్ర కొనసాగనుంది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులతో ఈ బస్సు యాత్ర సాగనుంది.

జగన్‌ పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజిక న్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైస్సార్సీపీ ఈ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. మొదటి దశలో మూడు ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకేసారి బస్సు యాత్రలు నిర్వహించినట్టుగానే.. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో యాత్ర ప్రారంభంకానుంది. 39 నియోజకవర్గాలలో రెండో విడత బస్సు యాత్ర సాగనుంది.