కేటీఆర్..నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవనివ్వం – రాజగోపాల్

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య మాటల వార్ ముదురుతోంది. సినిమా రేంజ్ లో డైలాగ్స్ వదులుతూ..ఎక్కడ తగ్గేదెలా అంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవరని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని కేటీఆర్ కు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ సవాల్ విసిరారు.

ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఎన్నోసార్లు మునుగోడు కోసం మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదన్నారు. తాను రాజీనామా చేస్తే ప్రజల కాళ్లు, చేతుల దగ్గరికి వచ్చి పనులు చేశారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేయకపోవడంతోనే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని అందరికీ అర్థమైందన్నారు. మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నావ్ బిడ్డా… ఖబర్ధార్.. అంటూ హెచ్చరించారు.