హైదరాబాద్‌లో ఘనంగా తెలంగాణ 2కే రన్‌

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో తెలంగాణ 2కే రన్‌ను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ జెండాఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌, గాయకులు మంగ్లీ, రామ్‌ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. నాలుగు వేలకుపైగా రన్నర్లు ఈ రన్‌లో పార్టిసిపేట్‌ అయ్యారు. సింగర్స్‌ మంగ్లీ, రామ్‌లు తమ పాటలతో రన్నర్లలో హుషారు నింపారు.