టిడిపి పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
త్వరలోనే టిడిపి రెండు, మూడు ముక్కలు కాబోతోంది.. విజయసాయిరెడ్డి
అమరావతి : టిడిపి ని ఉద్దేశించి వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆ పార్టీ రెండు, మూడు ముక్కలు కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆ పార్టీ అధినాయకుడు కరప్షన్ కేసులో జైలు పాలైనా… పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టిడిపి దయనీయ స్థితికి అద్దం పడుతోందని అన్నారు. 40 ఏళ్లుగా పార్టీకి మద్దతిస్తున్న బలమైన వ్యాపారవర్గంలో కూడా పునరాలోచన మొదలయిందని… ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.