మహాత్మా గాంధీజీ బాట సర్వదా అనుసరణీయం..
-జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అమరావతి: సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. మహాత్ముడి బాటలోనే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు నడిచారని అన్నారు. మన దేశ స్వతంత్ర పోరాటాన్నీ, గాంధీజీ జీవితాన్నీ వేర్వేరుగా చూడలేమని, అహింసాయుత ప్రజా పోరుతో పరాయి పాలన నుంచి భారత దేశాన్ని విముక్తం చేశారన్నారు బాపూజీ జయంతి సందర్భంగా మహాత్ముణ్ణి స్మరించుకొంటూ మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు.
బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారని , ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. . ఓటు, సత్యాగ్రహం విలువను గాంధీజీ తెలియచెప్పారని . ఆ ఆయుధాలు ఉపయోగించి నయా బ్రిటిష్ పాలకులను రాష్ట్రం నుంచి పంపించడం మన ధర్మంగా రాష్ట్ర ప్రజలు భావించాలని కోరారు.
అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/international-news/