తిరువూరులో టెన్షన్..టెన్షన్ : టీడీపీ, వైస్సార్సీపీ నేతల బహిరంగ చర్చ

తిరువూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ సవాల్‌కు వైస్సార్సీపీ నేతలు సిద్ధమవడంతో తిరువూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తిరువూరు అభివృద్ధి పై వైస్సార్సీపీ ఎమ్మెల్యే రక్షణ నిధికి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్.. ఇందుకు గాను.. తిరువూరులో సోమవారం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ముందస్తుగా ఆదివారం టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్‌, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లగట్ల స్వామిదాసు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌, రాష్ట్ర ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షుడు బొద్దకోళ్ల ప్రేమరాజు, పట్టణ బీసీసెల్‌ అధ్యక్షుడు మీనుగు శ్రీనివాసరావులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. బహిరంగ చర్చ వల్ల పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, చర్చకు సవాల్‌ చేసిన టీడీపీ, వైస్సార్సీపీ నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నామని సీఐ భీమరాజు ఒక ప్రకటనలో తెలిపారు.