జగన్ ఢిల్లీ పర్యటనపై రామ్మోహన్ వ్యాఖ్యలు

సిఎంగా గెలిచింది కేసులు మాఫీ చేయించకోవడానికా?

tdp-mp-rammohan-naidu

అమరావతి: టిడిపి ఎంపి కింజరావు రామ్మోహన్ నాయుడు సిఎం ఢిల్లీ పర్యటనపై ఘాటుగా స్పందించారు. 22 మంది లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ ను రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నామని, ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసులు మాఫీ చేయించుకోవడానికా, లేక రాష్ట్ర ప్రయోజనాలపై మీరు పోరాటం చేయడానికా? అని అడిగారు. మీరు ప్రధాని మోడితో మాట్లాడింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే మీరు ఎందుకు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించలేకపోతున్నారు? అని నిలదీశారు. ప్రధానితో 40 నిమిషాల పాటు ఈ విషయం మాట్లాడాను, హోదా ఇవ్వాల్సిందే అని నిలదీశామన్న మాట మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని అడిగారు. ప్రత్యేక హోదా అంటేనే వైఎస్‌ఆర్‌సిపి భయపడి పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.

‘మీపై 11 సీబీఐ కేసులు సహా 31 కేసులు ఉన్నట్టు మీరే అఫిడవిట్ లో రాసుకున్నారు. మరి మీరు ఢిల్లీ వెళ్లి ఎవరికీ ఒక్క వివరణ కూడా ఇవ్వకుండా ఉంటే అనుమానం రాదా? మీరు వివరణ ఇవ్వకపోతే ఆ 31 కేసుల మాఫీ కోసమే వెళ్లారని భావించాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా వచ్చేవరకు అడుగుతూనే ఉంటాం అని నాడు చెప్పిన మీరు ఇవాళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంపీలను వాడుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి అంతమందిని గెలిపిస్తే మీరు కేసుల మాఫీ కోసం ప్రయత్నాలు చేయడం సరికాదు’ అంటూ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/