వైస్సార్సీపీ లో చేరిన టీడీపీ నేతలు
టీడీపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. రాబోయే ఎన్నికల్లో వైస్సార్సీపీ ని ఓడించాలని కసిగా ఉన్న పార్టీ కి నెల్లూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎం జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరారు.
నెల్లూరు జిల్లా మాజీ జెడ్పిటిసి బొమ్మిరెడ్డి రాఘవేండ్ర రెడ్డి, ఆత్మకూరు మాజీ మార్కెట్ టార్డ్ చైర్మన్ ఇందూరు వేంకటరమణా రెడ్డికి పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.