వైఎస్ఆర్సిపిలోకి టిడిపి నేత జయమంగళ వెంకటరమణ
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
అమరావతిః టిడిపి పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సిపి లో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆయనకు వైఎస్ఆర్సిపి లోకి జగన్ స్వాగతం పలికారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మధ్యవర్తిత్వంతో ఆయన వైఎస్ఆర్సిపి లో చేరారు. మరోవైపు వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీట్ ను వెంకటరమణకు జగన్ కేటాయించారు. అంతేకాదు, ఆయనకు నలుగురు గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది.