జగన్ కు దేవినేని ఉమ సవాల్
విశాఖ భూ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా?..ఉమ
అమరావతి: సిఎం జగన్పై టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఈ 15 నెలల్లో విశాఖలో జరిగిన భూ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? అంటూ సిఎం జగన్ కు సవాల్ విసిరారు. అమరావతి భూముల విషయంలో భారీ స్థాయిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, బినామీల పేరుతో టిడిపి నేతలు పెద్దఎత్తున భూముల కొనుగోళ్లు చేశారని వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపిస్తుండగా, విశాఖలో వైఎస్ఆర్సిపి నాయకులు భూ దందాలు చేస్తున్నారంటూ టిడిపి ప్రత్యారోపణలు చేస్తుండడం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/