కావలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఎవరంటే..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఆరు జాబితాల్లో పలువురు నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటించగా..తాజాగా టీడీపీ కావలి నియోజకవర్గ ఇంచార్జ్ ను ప్రకటించింది.

ఈ ఎన్నికల్లో టిడిపి – జనసేన కలిసి బరిలోకి దిగుతుండడం తో సీట్ల సర్దుబాటు కాస్త ఆలస్యం అవుతుంది. ఇరు పార్టీల నేతలతో మాట్లాడి , అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చెరో రెండు , రెండు స్థానాలను ప్రకటించడం జరిగింది.

ఈ క్రమంలో తాజాగా టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిని (కావ్య కృష్ణా రెడ్డి) ఖరారు చేసింది. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశానుసారం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కావలి నియోజకవర్గానికి దగుమాటి వెంకట కృష్ణా రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.