రైతుబంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడిగా తాటికొండ రాజ‌య్య‌ బాధ్యతలు

Tatikonda-Rajaiah-take-charge-as-rythu bandhu-samithi-president-by-telangana-government

హైదరాబాద్‌ః : స్టేష‌న్ ఘ‌న్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య రైతుబంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌తలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా రైతుబంధు స‌మితి అధ్య‌క్ష బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టిన ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు రాజ‌య్య ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాజ‌య్య‌కు ప‌లువురు రైతులు, స్థానికులు శుభాకాంక్ష‌లు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ను ఈసారి కడియం శ్రీహరికి కేటాయించిన నేపథ్యంలో రాజయ్యకు కార్పొరేషన్‌ పదవితో సముచిత ప్రాధాన్యం కల్పించారు. రాజయ్య రైతుబంధు స‌మితి అధ్య‌క్షుడిగా రెండేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు.