దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు – కొడాలి నాని

వైస్సార్సీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అని, చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. కనీసం సర్పంచ్‌తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.

శుక్రవారం గుడివాడ 12వ వార్డులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన నాని ఈ వ్యాఖ్యలు చేసారు. ”చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశారా ?. కనీసం సర్పంచ్‌తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు.అవతలవారికి చెప్పే ముందు.. నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించాలి. రాజీనామాలను ఈక ముక్కతో సమానంగా విసిరేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌. ఎన్నికలంటే పారిపోయే వ్యక్తి చంద్రబాబు. వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టినపుడు ఎంపీ పదవికి రాజీనామా చేశారని, 18 మందితో రాజీనామా చేయించి.. 15 మందిని గెలిపించుకున్న వ్యక్తి జగన్‌.” అని కొడాలి నాని గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయి లో మండిపడ్డారు.