ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్..బిజెపికి ఫేర్వెల్: మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీః ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో దేశంలో రాజకీయ వేడి మొదలైంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాటు.. బిజెపికి ఫేర్వెల్ ప్రకటించినట్లైందని విమర్శించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో.. బిజెపి దాని మిత్ర పక్షాలకు ఫేర్వెల్ ప్రకటించినట్లే. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, ప్రగతిశీల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది’ అని ట్వీట్లో పేర్కొన్నారు.