నారా లోకేష్ ను కలిసిన తారకరత్న

నందమూరి తారకరత్న మంగళవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. హైదరాబాద్ లోని లోకేష్ ఇంటికి వెళ్లిన తారకరత్న..కుటుంబపరమైన అంశాలతో పాటు రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. గతంలో తారకరత్నటీడీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పార్టీ తరుపున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈరోజు లోకేష్ తో భేటీ అయ్యారని , ఏ నియోజకవర్గమైతే బాగుంటుందనే వివరాలు లోకేష్ తో చర్చించినట్లు సమాచారం.

లోకేష్ తో భేటీ విషయాన్ని తారకరత్న ట్వీట్ చేసి వెల్లడించారు.. ‘‘నన్ను కలవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం, మున్ముందు మేము కలిసి ఎలా పని చేయాలో చర్చించే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. దీనినే కొనసాగించి మన తెలుగుదేశం పార్టీలో సానుకూల ప్రభావం చూపేందుకు నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ తారకరత్న ట్వీట్ చేశారు.