ఈరోజే సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ప్రారంభం..
![](https://www.vaartha.com/wp-content/uploads/2021/12/sulthanpur-colleage.jpg)
మేకిన్ తెలంగాణలో భాగంగా ఇప్పటికే ఎన్నో పరిశ్రమల స్థాపిస్తున్న రాష్ట్ర సర్కార్.. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్కును ఈరోజు ప్రారభించబోతున్నారు.
ఈ పార్క్ లోని 7 ఫ్యాక్టరీల ను ఈరోజు ప్రారంభిస్తారు. కాగ ఈ విషయాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు. నేడు తెలంగాణకు గొప్ప రోజు అని కేటీఆర్ అన్నారు. నాలుగు ఏళ్ల క్రితం శంకు స్థాపన చేశామని.. ఈ రోజు ప్రారంభిస్తున్నామని తెలిపారు. భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక పార్కుకు ఇది ఒక పెద్ద మైలురాయి అని అన్నారు.
A big day for Telangana!
Very happy to announce that I will be inaugurating 7 factories in the Medical Devices Park, Sultanpur, today. This is a big milestone for India’s largest such industrial park, which I had the pleasure of launching 4 years ago.#TrailblazerTelangana pic.twitter.com/LxhjiLw53P— KTR (@KTRTRS) December 15, 2021