తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మునిసిపల్ పోలింగ్

మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు

Municipal polling in Telangana
Municipal polling in Telangana

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5మున్సిపాలిటీల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు సాగింది. . గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌ లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరిగింది. . చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగింది. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగింది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

వరంగల్‌లో 44.15 శాతం, ఖమ్మంలో 51.36, కొత్తూరులో 76.79, సిద్దిపేటలో 58.25, జడ్చర్లలో 54.21, అచ్చంపేటలో 60.50, నకిరేకల్‌లో 76.61, లింగోజిగూడలో 22.37 శాతం  పోలింగ్ నమోదైంది.  బోధన్ మున్సిపల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పీఎస్ 18/47 పోలింగ్ బూత్​ లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీల నేతలు ఆరోపించుకున్నారు.  గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 59 డివిజన్లు ఉండగా, 250 మంది బరిలో నిలిచారు. 

ఈ ఎన్నికల కోసం మొత్తం 1,539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/